తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాం
NEWS Mar 16,2025 04:34 pm
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అన్నింటిని పూర్తి చేశామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పినవే కాకుండా చెప్పని హామీల అమలు కూడా జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను తీర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీకి కేవలం రెండేసార్లు వచ్చాడని, ఈ 15 నెలల కాలంలో ఆయన దాదాపు 57 లక్షలకు పైగా వేతనం రూపేణా తీసుకున్నాడని ఆరోపించారు. కానీ ఆయన శాసన సభకు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. నిజాలు ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందనే భయంతో మౌనంగా ఉన్నాడని , ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదన్నారు.