బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు చేయాలి
NEWS Mar 16,2025 04:50 pm
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీఆర్ఎస్వి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను మార్కింగ్ చేసి అభ్యంతరకరమైన రీతిలో నిరసన తెలిపిన వారిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయవలసిందిగా భీంగల్ మండల పోలీస్ స్టేషన్ లో ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఫిర్యాదు చేశారు. విద్యార్థి నాయకులమననే ముసుగులో కొంతమంది రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దురుద్దేశంతో సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించడం దారుణమన్నారు.