230 గ్రాముల గంజాయి స్వాధినం
NEWS Mar 16,2025 04:53 pm
నిజామాబాద్ నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 230 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీఐ శ్రీనివాసరాజు తెలిపారు. గంజాయి అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఎస్సై హరిబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గంజాయి అమ్ముతున్న నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ కు చెందిన కోడె సంపత్ వ్యక్తిని పట్టుకున్నారు.