అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం
NEWS Mar 16,2025 12:54 pm
తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అమరజీవి జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. పొట్టి శ్రీరాముల వంటి నాయకుడు పది మంది ఉంటే ఏడాదిలోనే భారతదేశానికి స్వాతంత్ర్య తీసుకురావొచ్చిన అప్పట్లో మహాత్ముడు కొనియాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.