లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అబూ ఖతల్ ఖతం
NEWS Mar 16,2025 10:23 am
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ ఖతల్ సింఘీ హతమయ్యాడు. హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. పాకిస్తాన్ లో శనివారం రాత్రి 8 గంటలకు ఖతల్ ను ఉరి తీశారు. భారత దేశంలో దాడులకు పాల్పడ్డాడు. ఎన్ఐఏ తనను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఇప్పటికే ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసిలోని శివ-ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై దాడికి పాల్పడిన ఘటనలో కీలక పాత్రధారి తను.