కమనీయం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
NEWS Mar 16,2025 09:43 am
అమరావతిలోని వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండువగా జరిగింది కళ్యాణోత్సవం. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. వీరికి సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో చౌదరి. టీటీడీ పాలక వర్గం సభ్యులు, తిరుమల పెద్ద, చిన్న జీయర్ స్వాములు, మఠాధిపతులు హాజరయ్యారు. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు.