శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్
NEWS Mar 16,2025 09:22 am
అమరావతిలోని వెంకట పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్, సీఎంలకు ఘనంగా స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి. స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్న అనంతరం పూజలు చేశారు. అర్చన, హారతి, తీర్థాలు అందజేశారు. పూజారులు ఆశీర్వచనం చేశారు. జీయర్ స్వాములు గవర్నర్, సీఎంలకు ఆశీస్సులు అందించారు.