తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Mar 16,2025 09:13 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 82 వేల 580 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 905 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. దర్శనం కోసం భక్తులు ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.