ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీ
NEWS Mar 16,2025 02:17 pm
జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో దొంగలు ఎలక్ట్రానిక్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. కౌంటర్లోని నగదు సహా విలువైన ఎలక్ట్రానిక్ సామగ్రి ఎత్తుకెళ్లాడు. దొంగ చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.