బీఆర్ఎస్ నాయకుల ధర్నా
NEWS Mar 15,2025 05:54 pm
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నా చేస్తున్న నాయకులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని, బేషరతుగా సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.