పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్
NEWS Mar 15,2025 03:29 pm
కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు శనివారం ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారని, వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అర్జున్ గౌడ్, సంతోష్, సాయి తేజ, నల్ల ప్రదీప్, హేమంత్ పాల్గొన్నారు.