ఫైనాన్స్ వేధింపులకు వ్యాపారి మృతి
NEWS Mar 15,2025 03:29 pm
కామారెడ్డి: రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన వ్యాపారి విఠల్ ను ఓ ఫైనాన్స్ వారు తీసుకున్న రుణం కట్టమనడంతో ఒత్తిడికి గురై, శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. శనివారం కుటుంబీకులు మాట్లాడుతూ.. 4 రోజుల క్రితం విఠల్ ఇంటికి వచ్చిన ఫైనాన్స్ వారు డబ్బులు చెల్లించకపోతే ఇంటిని వేలమేస్తామని హెచ్చరించారన్నారు. తీవ్ర ఒత్తిడికి గురైన విఠల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలిపారు.