స్పోర్ట్స్ యూనివర్శిటీ కి 142 ఎకరాలు
NEWS Mar 15,2025 08:53 am
బెజవాడ ఎంపీ కేశినాని చిన్ని సంచలన ప్రకటన చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 220 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి స్పోర్ట్స్ యూనివర్శిటీ కోసం 142 ఎకరాల కేటాయింపు చేశారని, స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కాబోతుందని తెలిపారు. విజయవాడ లోని సిద్ధార్థ నగర్ లో ది పికిల్ బాల్ రిపబ్లిక్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్ట్ లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో హైదరాబాద్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ ను అద్భుతంగా నిర్వహించడం జరిగిందన్నారు.