ఛాంపియన్స్ ట్రోఫీ వీక్షణంలో రికార్డ్
NEWS Mar 15,2025 08:20 am
దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ మొత్తాన్ని రిలయన్స్ అంబానీ గ్రూప్ కు చెందిన జియో హాట్ స్టార్ ప్రసారం చేసింది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ ను ఏకంగా 540.3 కోట్ల మంది చూడడం విస్తు పోయేలా చేసింది. గత ఫిబ్రవరి నెల 19 నుండి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ కొనసాగింది. ఈ టోర్నీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హోస్ట్ చేసింది. కానీ ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలవలేదు. ఈ టోర్నీని 11,000 కోట్ల నిమిషాల పాటు వీక్షించారని , 6.2 కోట్ల మంది వీక్షకులతో అరుదైన ఘనత సాధించిందని జియో హాట్ స్టార్ ప్రకటించింది.