KMR: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాలేజీ గ్రౌండ్ లో ఉదయం వాకర్స్ అందరు కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. వాకర్స్ అందరు కలసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలు సహజ రంగులను వినియోగించుకోవాలని తెలిపారు.