జానారెడ్డి..కోమటిరెడ్డితో అద్దంకి భేటీ
NEWS Mar 14,2025 07:21 pm
ఎమ్మెల్యేల కోటా కింద ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా మాజీ మంత్రి కందూరు జానా రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన దయాకర్ ను అభినందనలతో ముంచెత్తారు. ఈసారి ఎమ్మెల్సీలుగా నల్లగొండ జిల్లాకు ప్రాధాన్యత లభించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ తో పాటు ఇదే జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ కు ఛాన్స్ ఇచ్చింది పార్టీ హైకమాండ్.