బోరుగడ్డ అనిల్ కు పిటీ వారెంట్
NEWS Mar 14,2025 10:43 am
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ను పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు చిలకలపూడి పోలీసులు. గురువారం రాత్రి 2వ అదనపు జిల్లా జడ్జి ముందు బోరుగడ్డ ను హాజరు పరిచారు. ఓ మైనర్ బాలిక మృతి కేసులో బెదిరింపులకు పాల్పడ్డారని 2019లో అనిల్ కుమార్ పై కేసు నమోదు చేశారు.ఈ కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు జడ్జి.