కేసీఆర్ ను విడిచి పెట్టే ప్రసక్తే లేదు
NEWS Mar 14,2025 10:24 am
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 7 లక్షల కోట్లు అప్పు ఎలా అయ్యిందో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్ ను నమ్మి రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల భారం మోపాడని ఆవేదన చెందారు. ఇంత అప్పులు చేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను విడిచి పెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. తను చేసిన అప్పుల కుప్ప గురించి బయట పెట్టక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాములమ్మ.