పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
NEWS Mar 14,2025 09:46 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముస్తాబవుతోంది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో కనీవిని ఎరగని రీతిలో సభను నిర్వహించేలా ప్లాన్ చేశారు. అతిరథ మహారథులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రం నలు మూలల నుంచి జనసేన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. అందరూ పిఠాపురం బాట పట్టారు. ఎక్కడ చూసినా జనసేన పార్టీ జెండాలు అగుపిస్తున్నాయి.