తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
NEWS Mar 13,2025 07:42 pm
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్, విజయ శాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్ ఎన్నికైనట్లు ప్రకటించారు శాసన మండలి కార్యదర్శి. ఈ మేరకు ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.