కేంద్ర మంత్రి జై శంకర్ తో సీఎం భేటీ
NEWS Mar 13,2025 07:37 pm
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో 3 రోజుల పాటు జరిగే భారత్ సమ్మిట్ పై కేంద్ర మంత్రి జై శంకర్ తో చర్చించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఈ సమ్మిట్ కు 60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, ఇందుకు కేంద్రం నుంచి సహకారం అందించాలని ఈ సందర్బంగా కోరారు. సీఎం వెంట ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, తదితరులు ఉన్నారు.