తడి, పొడి చెత్తపై విద్యార్థులకు అవగాహన
NEWS Mar 13,2025 06:34 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 13వ వార్డులో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు తడి, పొడి, హానికర చెత్త గురించి మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పించారు. తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తల్లిదండ్రులకు తెలపాలని విద్యార్థులను కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రత్నాకర్, ప్రవీణ్, విష్ణు, ముజీబ్ తదితరులున్నారు.