పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆనంద్ గౌడ్
NEWS Mar 13,2025 03:32 pm
మెట్పల్లి అసిస్టెంట్ సెషన్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది చర్లపల్లి ఆనంద్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకపత్రాన్ని అందుకున్నారు. ప్రాసిక్యూషన్ తరఫున బాధితులకు న్యాయం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా పలువురు న్యాయవాదులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు అభినందించారు.