జీహెచ్ఎంసీ జూలు విదిల్చింది. మొన్నటికి మొన్న తాజ్ హోటల్ పన్ను చెల్లించ లేదంటూ తాళం వేసింది. గురువారం హైదరాబాద్ లో పేరు పొందిన ప్రతిమా హాస్పిటల్ కు ఝలక్ ఇచ్చింది. ఆస్పత్రిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. గత రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదంటూ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 2025 నాటికి మొత్తం బకాయిలు రూ. 37.35 లక్షలు కట్టాల్సి ఉందని, చెల్లించక పోవడంతో తాళం వేసినట్లు తెలిపింది.