సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
NEWS Mar 13,2025 03:48 pm
ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణ కేంద్రంగా తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక దీక్షను ఎంఈఏఫ్ జిల్లా అధ్యక్షుడు ఆయుధాల రాంచందర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఆగస్టు 1న అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.