ట్రెక్కింగ్ లో పాల్గొన్న నేషనల్ ట్రినిటీ స్కూల్ విద్యార్థులు
NEWS Mar 13,2025 12:45 am
బుజ్జియ్య పేట మండలం వడ్డాది గ్రామంలో నేషనల్ ట్రినిటీ స్కూల్ లో సుమారుగా ఆరు నెలల నుండి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు ప్రథమ సోపాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా ఈరోజు ట్రెక్కింగ్ ( కొండలు ఎక్కడం)కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ట్రెక్కింగ్ లో సుమారుగా 69 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ v. రామరాజు గారు మాట్లాడుతూ ఈ ట్రెక్కింగ్ అనేది పిల్లలకు మానసిక దృఢత్వాన్ని మరియు శారీరత్వాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేశారు