ఎమ్మెల్యేల తీరుపై సీఎం అసహనం
NEWS Mar 12,2025 05:51 pm
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి వ్యవహారంపై ఫైర్ అయ్యారు. మీటింగ్ కు జరుగుతుండగా బయటకు వెళ్లి పోయారు. ఓ వైపు తాను ఇంత సీరియస్ గా చెబుతుంటే అలా వెళ్లి పోతే ఎలా అని మండిపడ్డారు. ఇంత నాన్ సీరియస్ గా ఉంటారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటే ఎలా అని ఫైర్ అయ్యారు. పాలిటిక్స్ అంటే పిల్లలాట అనుకుంటున్నారా అని సీరియస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై ఫోకస్ పెట్టాలన్నారు సీఎం.