పస లేని గవర్నర్ ప్రసంగం
NEWS Mar 12,2025 12:04 pm
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇవాళ అసెంబ్లీలో చేసిన గవర్నర్ ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా గాంధీ భవన్లో ప్రెస్మీట్ లాగా ఉందంటూ ఎద్దేవా చేశారు. గత 15 నెలల అట్టర్ప్లాప్ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నామన్నారు. రేవంత్ చేతకానితనం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండి పోతున్నాయని వాపోయారు. రాష్ట్రంలో 30 శాతానికి మించి రుణమాఫీ జరగ లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు తప్పా నిజాలు లేవన్నారు. 20 శాతం కమీషన్ తప్ప. విజన్ లేని ప్రభుత్వం ఇది అంటూ ఆరోపించారు. కేసీఆర్పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదన్నారు.