కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
NEWS Mar 12,2025 05:06 pm
హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్రోన్ ఎగర వేసినందుకు కేటీఆర్ పై కేసు నమోదైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ పై కేసు నమోదు చేశారని ఆరోపించారు తన తరపు న్యాయవాది.. మేడిగడ్డ బ్యారేజ్ నిషిద్ధ ప్రాంత జాబితాలో ఉందన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు.