రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా జైపాల్ రెడ్డి
NEWS Mar 13,2025 04:32 pm
కామారెడ్డి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గవర్నర్ గా జైపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా రక్త నమూనాల సేకరణ ప్రతినిధులు అభినందించారు. రోటరీ క్లబ్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని చెప్పారు. రక్తదాతల సమూహం ఫౌండర్, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ ఘనంగా సన్మానించారు.