ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
NEWS Mar 12,2025 10:29 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యలయంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ . దివవగత తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం తాను కట్టుబడి ఉన్నానని ఈ సందర్బంగా ప్రకటించారు జగన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నం చేశానని అన్నారు. గత 5 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలు తీసుకు వచ్చానని చెప్పారు.