సైబర్ నేరగాళ్ల ప్రలోభాలకు గురికావద్దు
NEWS Mar 13,2025 04:35 pm
WNP: అత్యాశకు వెళ్లి సైబర్ నేరస్థుల ప్రలోభానికి గురి కావద్దని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు అర్జించాలనే అత్యాశను సైబర్ నేరగాళ్లు లాభాలుగా మార్చుకుంటారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. వనపర్తిలోని ప్రధానమంత్రి కౌశల్ యోజన కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.