టీబీ రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యం
NEWS Mar 13,2025 04:35 pm
WNP: జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద నాట్కో ఫార్మా ట్రస్ట్ వారి సహకారంతో టీబీ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని చెప్పారు.