రూ. 6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకం
NEWS Mar 11,2025 06:36 pm
నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాస పథకానికి కేటాయించామన్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందన్నారు. మే 31 లోగా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు నిధులు కేటాయిస్తామన్నారు భట్టి.