ఆర్టీసీలో 400 మంది ఉద్యోగులపై వేటు
NEWS Mar 11,2025 06:18 pm
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న 400 మందిపై వేటు వేశారు ఎండీ సజ్జనార్. కన్నీళ్లు పెట్టుకున్నారు మహిళా కండక్టర్లు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తమపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న పొరపాట్లకు తమను బాధ్యులు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తమను రోడ్డుపై పడేశారంటూ వాపోయారు. ఎండీ నిర్వాకం పట్ల కన్నీటి పర్యంతం అయ్యారు సిబ్బంది.