రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ మాత్రమే
NEWS Mar 13,2025 03:50 pm
మెట్ పల్లి: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గంటపాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాంలో జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, కోరుట్ల నియోజకవర్గం ఇన్చార్జి సుఖేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.