ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎంపికపై హర్షం
NEWS Mar 11,2025 10:50 pm
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక కావడం పట్ల బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా స్పెషల్ ఇన్వైటీ యనమదల రాజ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె అయినవిల్లిలో మాట్లాడుతూ.. సోము వీర్రాజు బీజేపీ పార్టీకి చేసిన సేవలు అమూల్యమైనవి అని అన్నారు. ఆయన రెండో సారి ఎమ్మెల్సీ కావడం చాలా ఆనందంగా వుందన్నారు.