రాజన్న సిరిసిల్లలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా లోని టీజీఎస్పీ 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ గంగారాం (55) లిఫ్ట్ ప్రమాదంలో ఇరుక్కుని మృతి చెందారు. సిరిసిల్లలోని ఓ భవనంలో లిఫ్ట్ తాడు తెగిపోయి కింద పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో టీజీ సెక్రటేరియట్కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు గంగారం. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు డీజీపీ. కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.