శ్రీవారి పరకామణి లెక్కింపులో అవకతవకలు
NEWS Mar 11,2025 07:57 am
టీటీడీ ఈవో జె. శ్యామల రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయి. శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించారు టీటీడీలో పని చేస్తున్న కృష్ణకుమార్. హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసినట్లు గుర్తించారు. గత సంవత్సరం ఒక నెలలో రూ. 6 లక్షల విదేశీ కరెన్సీ ని దొంగిలించాడని తేలింది. దీంతో తనపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు.