బహుజనుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
NEWS Mar 11,2025 07:48 am
బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు మంత్రి ఎస్. సవిత. టీడీపీ బహుజనుల అభివృద్దిపై ఫోకస్ పెట్టిందన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. తమది బీసీల పక్షపాతి ప్రభుత్వమన్నారు. బీసీల అభివృద్ధికి కోసం గతంలో ఎన్నడూలేనంతగా ప్రస్తుత బడ్జెట్ లో అత్యధికంగా రూ.33,878.45 కోట్ల నిధులు కేటాయించినందుకు సీఎంకు, మంత్రి పయ్యావుల కేశవ్ కు ధన్యవాదాలు తెలిపారు.