మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఎమ్మెల్యే
NEWS Mar 11,2025 10:24 am
మెట్పల్లి మార్కెట్ యార్డులో పసుపు పంటను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. పసుపునకు కేంద్రప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని కోరారు. పసుపునకు మద్దతు ధర కోసం రేపటి ధర్నాకు పార్టీలకు అతీతంగా ప్రతి రైతన్న పాల్గొనాలని కోరారు. ఓట్లకోసం రైతులను మోసం చేస్తూ పదవిలో ఉంటూ పబ్బం గడుపుతున్న నాయకులను నిలదీయాలన్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.