రేపు రైతు ఐక్యవేదిక నిరసన
NEWS Mar 11,2025 10:22 am
ఛలో మెట్పల్లి పేరుతో రేపు ఉదయం 10 గంటలకు మెట్పల్లిలోని పాత బస్టాండు వద్ద నిరసన ధర్నా చేపట్టనున్నట్లు జిల్లాలోని రైతులు తెలిపారు. రైతు ఐక్యవేదిక జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పసుపు మద్దతు ధర కోసం నిరసన ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి జిల్లాలోని రైతులు అధికసంఖ్యలో పాల్గొని రైతుల గోసను ప్రభుత్వాలకి వినిపించేలా చేయాలని రైతు ఐక్యవేదిక కోరింది.