పని చేసిన వారికి పదవులు ఇస్తాం
NEWS Mar 10,2025 08:52 pm
మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇంకా పదవులు చాలా భర్తీ చేయాల్సి ఉందని, వాటితో కొందరిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పదవులు రాలేదని బాధ పడవద్దని సూచించారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. బలహీన వర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్దిని మరోసారి చాటామన్నారు. యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చామన్నారు లోకేష్.