సంగారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తు దారులు 57 దరఖాస్తులను తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించారు.