ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన వాదనలు
NEWS Mar 10,2025 05:37 pm
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో వాదనలు ముగిశాయి. రాధా కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు తీర్పు వాయిదా వేసింది. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడంతో రాధా కిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాధా కిషన్ రావుకు బెయిల్ ఇవ్వవద్దని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో చక్రదర్ గౌడ్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.