సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కల్వకుంట్ల కుటుంబంపై ధ్వజమెత్తారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని అందుకే కేటీఆర్ తాను భయపడనంటున్నరాని ఎద్దేవా చేశారు. కేసులకు భయపడితే నేరాలు చేయరన్నారు. కేసీఆర్ ఏమైనా అంటారనే కిషన్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి రాలేదన్నారు . మెట్రో తానే తెచ్చినట్టుగా కిషన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవేళ ఆయన తెస్తే అది ఎక్కడుందో చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి అంత బరితెగింపు ఎందుకో అన్నారు.