కేసీఆర్ కు సరితూగే నేతలు లేరు
NEWS Mar 10,2025 03:08 pm
మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. కేసీఆర్ స్థాయి వేరని, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరి పోరన్నారు. వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది ఆయన మౌనంగా ఉన్నారని అన్నారు. మోడీ మంచోడు అనకపోతే జైల్లో వేస్తాడని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి ఆ పని చేయలేడు కదా.. ఆయన నిస్సహాయుడంటూ పేర్కొన్నారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కోసం తమ హయాంలోనే కృషి చేశామన్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు తామే చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.