ప్రణయ్ హత్య కేసులో మరణశిక్ష
NEWS Mar 10,2025 02:11 pm
అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. సుభాష్ శర్మ బీహార్కు చెందిన నేరస్తుడు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలకు జీవితఖైదు విధిస్తూ జడ్జీ తీర్పు వెలువరించారు. తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు.