అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
NEWS Mar 10,2025 10:22 am
మెట్ పల్లి మండలంలోని వెల్లుల్లలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గ్రామశివారులో రేషన్ బియ్యం నిల్వ ఉందని సమాచారం రాగా.. ఎస్సై కిరణ్ కుమార్, విజిలెన్స్ సిబ్బంది వెళ్లి సుమారు 17 బస్తాల బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బియ్యం నిల్వ చేసిన వ్యక్తి పోలీసులను గమనించి పారిపోయినట్లు పేర్కొన్నారు.