గంగారంలింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోరు మోటర్
NEWS Mar 10,2025 04:56 am
కథలాపూర్: భూషణ్రావుపేట్ గ్రామంలోని వైకుంఠధామం వద్ద గంగారం లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ భూమారెడ్డి లక్ష రూపాయల విలువైన బోర్ మోటార్ను అందించారు. భూమారెడ్డి మాట్లాడుతూ.. గంగారం లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో పనులు చేశామని, అవసరం ఉంటే తమని సంప్రదించాలని తెలిపారు. ఇప్పటికీ గంగారం లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ రథం, బాడీ ఫ్రిడ్జ్, గ్రామాలలో బోరు మోటర్లు, వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.